మేరు


 ఐరిష్ కవి విలియం బట్లర్ యేట్స్ (1865 - 1939) రచించిన కవిత  మేరు (1934)  కి స్వేచ్ఛానువాదం... 


    నాగరికత పెనవేసుకు పోయింది, లోబడి
    ఒక శాసనానికి, శాంతి అనే ఓ ఆకృతికి,
    వన్నె వన్నెగా భిన్న భిన్నంగా అల్లుకుపోయిన మాయకి; తలపుల వడి
    మనిషి జీవితం, భయంతో భీతిల్లినా మనిషి ఆపలేడు
    మారణహోమం, యేళ్లు శతాబ్దాలు అయినా శతాబ్దాలు యుగాలైనా
    శమించని ఆకలితో ప్రళయ తాండవం చేస్తో, సర్వ విధ్వంసం కావిస్తో వచ్చేది
    ఎడారి వంటి వినాశనమైన వాస్తవంలోకే:
    ఈజిప్టు మరియు గ్రీకు రాజ్యాలకు వీడ్కోలు, వీడ్కోలు రోమ్ మహాసామ్రాజ్యానికి.

    ఋషులు మేరు పర్వతం పైన, యోగులు హిమాలయాల్లో
    మంచు కప్పిన ఆ గుహల్లో, ఎముకలు కొరికే శీతాకాలపు హిమ పాతం
    తమ నగ్న శరీరాలను చాకుల్లా తాకుతున్నా, వారికీ తెలుసు
    పగటి వెంబడే చీకటి వస్తుందని, ఉషోదయానికి ముందే
    మనిషి యొక్క ప్రశస్తి మనిషి కట్టిన సౌధాలు తృటిలో బూడిదై పోతాయని.

Comments

Popular posts from this blog

సుదీర్ఘ యానం

ఊపిరి

వేలకొద్ది ఆశలు అలాటివి