మేరు
ఐరిష్ కవి విలియం బట్లర్ యేట్స్ (1865 - 1939) రచించిన కవిత మేరు (1934) కి స్వేచ్ఛానువాదం...
నాగరికత పెనవేసుకు పోయింది, లోబడి
ఒక శాసనానికి, శాంతి అనే ఓ ఆకృతికి,
వన్నె వన్నెగా భిన్న భిన్నంగా అల్లుకుపోయిన మాయకి; తలపుల వడి
మనిషి జీవితం, భయంతో భీతిల్లినా మనిషి ఆపలేడు
మారణహోమం, యేళ్లు శతాబ్దాలు అయినా శతాబ్దాలు యుగాలైనా
శమించని ఆకలితో ప్రళయ తాండవం చేస్తో, సర్వ విధ్వంసం కావిస్తో వచ్చేది
ఎడారి వంటి వినాశనమైన వాస్తవంలోకే:
ఈజిప్టు మరియు గ్రీకు రాజ్యాలకు వీడ్కోలు, వీడ్కోలు రోమ్ మహాసామ్రాజ్యానికి.
ఒక శాసనానికి, శాంతి అనే ఓ ఆకృతికి,
వన్నె వన్నెగా భిన్న భిన్నంగా అల్లుకుపోయిన మాయకి; తలపుల వడి
మనిషి జీవితం, భయంతో భీతిల్లినా మనిషి ఆపలేడు
మారణహోమం, యేళ్లు శతాబ్దాలు అయినా శతాబ్దాలు యుగాలైనా
శమించని ఆకలితో ప్రళయ తాండవం చేస్తో, సర్వ విధ్వంసం కావిస్తో వచ్చేది
ఎడారి వంటి వినాశనమైన వాస్తవంలోకే:
ఈజిప్టు మరియు గ్రీకు రాజ్యాలకు వీడ్కోలు, వీడ్కోలు రోమ్ మహాసామ్రాజ్యానికి.
ఋషులు మేరు పర్వతం పైన, యోగులు హిమాలయాల్లో
మంచు కప్పిన ఆ గుహల్లో, ఎముకలు కొరికే శీతాకాలపు హిమ పాతం
తమ నగ్న శరీరాలను చాకుల్లా తాకుతున్నా, వారికీ తెలుసు
పగటి వెంబడే చీకటి వస్తుందని, ఉషోదయానికి ముందే
మనిషి యొక్క ప్రశస్తి మనిషి కట్టిన సౌధాలు తృటిలో బూడిదై పోతాయని.
Comments
Post a Comment